పిట్లం, వెలుగు: జుక్కల్ మండలంలో శివాజీ విగ్రహం చోరీకి గురైంది. శనివారం రాత్రి జుక్కల్ మండలం డోన్గాం, సోపూర్ దారిలో శక్తినగర్ చౌరస్తాలో ప్రతిష్టించిన శివాజీ విగ్రహాన్ని ఎత్తుకెళ్లడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది.
గ్రామస్తుల ఫిర్యాదు మేరకు జుక్కల్ పోలీసులు శక్తినగర్ చౌరస్తాలోని విగ్రహం గద్దెను పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భువనేశ్వర్ తెలిపారు.