శివునిపల్లిలో మూన్నాళ్లకే కంకర తేలిన రోడ్డు

శివునిపల్లిలో మూన్నాళ్లకే కంకర తేలిన రోడ్డు

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్ మండలం శివునిపల్లిలోని జఫర్​గఢ్ రోడ్డులో అంబేద్కర్ జంక్షన్ వద్ద ఆర్అండ్​బీ డిపార్ట్​మెంట్ ఆధ్వర్యంలో ఇటీవల బీటీ రోడ్డు రిపేర్ పనులు జరిగాయి. కొద్ది రోజులకే కంకర తేలి గుంతలమయంగా మారింది. ఈ జంక్షన్​ మూలమలుపు కావడంతో ప్రమాదలు కూడా జరుగుతున్నాయి.

ప్రజల ఫిర్యాదుతో ఇటీవల రోడ్డు మరమ్మతులు చేపట్టగా, ఇప్పడు సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో ఆఫీసర్లు నాణ్యతతో రోడ్డు వేయలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నాణ్యత పాటించి రోడ్డు రిపేర్​ చేయాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.