
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ కోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా శివునూరి శోభన్గౌడ్ నియామకమయ్యారు. సోమవారం మెదక్లోని సీనియర్ సివిల్ కోర్టు, జూనియర్ సివిల్ కోర్టుల్లో ప్రభుత్వం తరఫున వాదించేందుకు శోభన్ గౌడ్ కు న్యాయవాదిగా నియామకపత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావును మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.