మద్దులపల్లి మార్కెట్​లో కొనుగోళ్లు ప్రారంభం

మద్దులపల్లి మార్కెట్​లో కొనుగోళ్లు ప్రారంభం

ఖమ్మం రూరల్, వెలుగు : మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్​లో బుధవారం మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకుడు ఆర్.లక్ష్మణుడు ప్రారంభించారు. మొదటి రోజు కూసుమంచి మండలం పోచారం గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వర్లు తాలు రకం మిర్చి తీసుకురాగా క్వింటాకు రూ.7200 చొప్పున ధర పలికింది. ఖమ్మం మార్కెట్​కు ఒక్కరోజే లక్ష బస్తాల మిర్చి రావడంతో అక్కడ చోటు లేక రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్కెట్​అధికారులను మద్దులపల్లిలో  కొనుగోళ్లు ప్రారంభించాలని ఆదేశించారు. 

ఈ సందర్భంగా తొలుత మార్కెట్​లోకి పంట తీసుకువచ్చిన రైతు వెంకటేశ్వర్లును వ్యాపారులు, అదనపు సంచాలకులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఎంవో ఆలీం, ఖమ్మం మార్కెట్​ఎస్జీఎస్​ ప్రవీణ్ కుమార్, ఈఈ ఎల్లేశ్, టెక్నికల్ కన్సల్టెంట్ రావి ఉమామహేశ్వరరావు, మద్దులపల్లి మార్కెట్​సెక్రటరీ ఆంజనేయులు,  సిబ్బంది పాల్గొన్నారు.