
హైదరాబాద్, వెలుగు: విదేశాలలో ఉన్నత విద్యను కోరుకునే భారతీయ విద్యార్థులకు యునైటెడ్ స్టేట్స్ మొదటి చాయిస్ అని స్టడీ ద్వారా వెల్లడయిందని మనదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. 2022–-23 విద్యా సంవత్సరంలో 2,68,923 మంది భారతీయ విద్యార్థులు అమెరికా వెళ్లారు. గత ఏడాదితో పోలిస్తే వీరి సంఖ్య 35శాతం పెరిగిందని సంబంధించిన ఓపెన్ డోర్స్ రిపోర్ట్ (ఓడీఆర్) తెలిపింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన ఓపెన్ డోర్స్ రిపోర్ట్ ..అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుదలను పరిశీలించడమే కాకుండా వారి నేపథ్యాలు, ఆర్థిక సహాయ వనరులపై స్టడీ చేస్తుంది. అమెరికాలో అంతర్జాతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థులలో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. ఈ ఏడాది జూన్–-ఆగస్టు సీజన్లో రికార్డుస్థాయిలో స్టూడెంట్ వీసాలను ఇచ్చామని ఇండియాలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి చెప్పారు.
ALSO READ : గాజా స్వాధీనం : హమాస్ పార్లమెంట్ లో ఇజ్రాయెల్ సైన్యం