![కంటెంట్ క్రియేషన్ కోసం భారీ ప్లాన్స్](https://static.v6velugu.com/uploads/2022/09/Shreyas-Media-Target-1400-Crore-Turnover-..-IPO-in-Five-Years_ixBrlUObqQ.jpg)
- రూ. 1,400 కోట్ల టర్నోవర్
- ఐదేళ్లలో ఐపీఓ
- శ్రేయస్ మీడియా ఫౌండర్ శ్రీనివాస్
హైదరాబాద్, వెలుగు: సినిమా అనగానే శ్రేయాస్ మీడియా గుర్తుకొచ్చేలా గుర్తింపు తెచ్చుకోవాలని శ్రేయాస్ మీడియా లక్ష్యంగా పెట్టుకుంది. సినిమా ఈవెంట్లను దేశంలోని పల్లె ప్రజలకు సైతం చేరువ చేసే ప్లాన్లో ఉన్నామని, దీంతో డైరెక్ట్గా–ఇండైరెక్ట్గా లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే టార్గెట్ను పెట్టుకున్నామని శ్రేయస్ మీడియా ఫౌండర్ శ్రీనివాస్ చెప్పారు. దీంతోపాటు ఓటీటీ రంగంలోకి దూకుడుగా ఎంటరయ్యే ప్రపోజల్ ఉందని వెల్లడించారు.
రూ. 100 కోట్ల టర్నోవర్కు చేరుకున్న తమ గ్రూప్ ఇప్పుడు విస్తరణ కోసం భారీగా ఫండ్స్ సేకరించే ప్రయత్నాలలో ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే పెద్ద ఇన్వెస్టర్లతో ఈ దిశలో డిస్కషన్స్ నడుస్తున్నాయని తెలిపారు. ఖమ్మం జిల్లాలోని చిన్న పల్లెలో పుట్టిన తాను సొంత కాళ్లపై నిలబడాలనే ఆలోచనతో 2005 లో యాడ్ ఏజన్సీతో వ్యాపారంలోకి వచ్చానని శ్రీనివాస్ చెప్పారు. ఆ తర్వాత సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లతో పట్టు సాధించి, అనంతరం సినిమా ప్రొడక్షన్లోకి జర్నీ కొనసాగించినట్లు వివరించారు. దక్షిణాదిలోని నాలుగు భాషల సినిమాలతోపాటు, బాలీవుడ్ సినిమాలకు సైతం ఈవెంట్లు చేసేలా భారీ ప్లాన్స్ ఉన్నాయని, దుబాయ్ కేంద్రంగా గ్లోబల్ ఈవెంట్లూ చేపడతామని శ్రీనివాస్ చెప్పారు.
రాబోయే మూడేళ్లలో రూ. 1,400 కోట్ల టర్నోవర్ టార్గెట్ అందుకుని, తరువాత ఐపీఓకి రావాలనే ఆలోచనతో ఉన్నట్లు వెల్లడించారు. వందల మందికి నేరుగా, వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలను కల్పించడంలో తాము సక్సెసయ్యామని వివరించారు.
ఇన్స్టంట్ బ్రాండింగ్....
ఒకప్పుడు బ్రాండ్ క్రియేషన్ అంటే ఏళ్ల తరబడి కష్టపడాల్సి వచ్చేదని, ఇప్పుడలా కాదని, ఇన్స్టంట్ లేదా ఓవర్నైట్బ్రాండ్క్రియేషన్ మార్కెట్కు అవసరమని శ్రీనివాస్ తెలిపారు. ఈ దిశలో సొంత ఆలోచనలతో బిజినెస్ మోడల్స్ను తేనున్నట్లు పేర్కొన్నారు.
ఇన్సినిమా బ్రాండింగ్.....
ఇన్సినిమా బ్రాండింగ్తో నిర్మాతల ఖర్చు తగ్గించడంతోపాటు, చాలా బెనిఫిట్స్ ఉంటాయనే కాన్సెప్ట్ను సినిమా ఇండస్ట్రీకి తాము చేసి, చూపించామని శ్రీనివాస్ వెల్లడించారు. సినిమా–సినిమా ఇండస్ట్రీ బ్రాండింగ్లో లీడింగ్ ప్లేయర్గా కొనసాగాలనే ఉద్దేశంతో క్రియేటివ్ ఆలోచనలతో ముందుకు దూసుకెళ్తున్నామని పేర్కొన్నారు.
సినిమా ఈవెంట్లు, ప్రొడక్షన్తో బిజీగా ఉన్నా.... తాజా పోకడలనూ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నానని చెబుతూ.... ఓటీటీ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సరైన రీతిలో ఎంటర్ కాబోతున్నట్లు చెప్పారు. అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఇతర ఓటీటీలకు భిన్నంగా తమ ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంటుందని వివరించారు. మిలినియల్స్కు ఒక రకమైన కంటెంట్ ఇష్టమైతే, జనరేషన్ జెడ్కు మరో విధమైన కంటెంట్పసందనే విషయాన్ని తాను స్టడీ చేశానని... ఆయా వర్గాలను ఆకట్టుకునేలా కంటెంట్ క్రియేషన్ కోసం భారీ ప్లాన్స్ చేస్తున్నట్లు చెప్పారు.
ఓటీటీ సెగ్మెంట్లో సబ్స్క్రిప్షన్ మోడల్ కనుమరుగవుతుందని, అందుకే తాము డిఫరెంట్ స్ట్రేటజీతో రాబోతున్నామని వెల్లడించారు. కంటెంట్, సినిమా, లైవ్ కన్సర్ట్స్, ఈవెంట్లతో సౌత్ ఏషియాలోని దేశాలకు విస్తరించి, ఒక కొత్త ఎకో సిస్టమ్ తెచ్చే ప్రయత్నాలలో ఉన్నట్లు శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ చెప్పారు.