యువతి మిస్సింగ్

యువతి మిస్సింగ్

నవాబుపేట, వెలుగు: మండలంలోని ఇప్పటూరు గ్రామానికి చెందిన శిరీష(21) అదృశ్యమైనట్లు ఎస్ఐ విక్రం​ తెలిపారు. గ్రామానికి చెందిన శిరీష ఇంటర్​ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. ఈ నెల 23న కారుకొండ గ్రామంలో బంధువు అంత్యక్రియలకు పేరెంట్స్​ వెళ్లగా, అప్పటి నుంచి కూతురు కనిపించలేదు. ఆచూకీ లభించకపోవడంతో శనివారం తండ్రి శాంతయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.