ప్రారంభమైన సిద్దేశ్వరుడి బ్రహ్మోత్సవాలు

ప్రారంభమైన సిద్దేశ్వరుడి బ్రహ్మోత్సవాలు

బచ్చన్నపేట, వెలుగు: జనగామ జిల్లా కొడువటూరు సిద్దేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ముందుగా ఆలయ ఆవరణలోని పురాతన బావి వద్ద గంగ పూజ చేసి, స్వామివారికి ఆ నీటిని తీసుకువచ్చి అభిషేకం చేశారు. సాయంత్రం శతరుద్రాభిషేకం, మంగళహారతి, మంత్రపుష్పం తీర్థప్రసాద వినియోగం జరిపించారు.

మహాశివరాత్రి సందర్భంగా అడిషనల్​ కలెక్టర్​ రోహిత్​సింగ్, ఆర్డీవో గోపీరాం, ఏసీపీ చేతన్​నిత్, డీపీవో స్వరూప స్వామివారి కల్యాణ ఏర్పాట్లను పరిశీలించారు. అంతకుముందు అడిషనల్​ కలెక్టర్​అధికారులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఈవో వంశీతో మాట్లాడి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.