
కొమురవెల్లి, వెలుగు: సెల్ఫోన్ కొనివ్వలేదని యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. కర్జీది గ్రామానికి చెందిన రూపేశ్ (18) కుటుంబసభ్యులు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడలో మేస్త్రీ పనులు చేస్తూ జీవిస్తున్నారు. సో మవారం రూపేశ్ తనకు సెల్ఫోన్ కొనివ్వాలని కుటుంబసభ్యులతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కొమురవెల్లి మండలం గౌరాయపల్లి సమీపంలో రైల్వే ట్రాక్పై శవమై కనిపించాడు. రూపేశ్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.