మార్చి 25 పాపవిమోచని ఏకాదశి: ఆరోజు ఎలా పూజ చేయాలి.. ఏ కథ చదవాలి..

మార్చి 25  పాపవిమోచని ఏకాదశి:  ఆరోజు  ఎలా పూజ చేయాలి.. ఏ కథ చదవాలి..

హిందూ పురాణాల ప్రకారం ఏకాదశి చాలా పవిత్రమౌన రోజు ప్రతి ఏకాదశికి విశిష్టత ఉంటుంది.  అందుకే నెలలో వచ్చే రెండు ఏకాదశి దినాల్లో ఉపవాసం ఉండి.. లక్ష్మీ నారాయణులను పూజించాలని పండితులు చెబుతుంటారు.. తెలుగు సంవత్సరాల్లో చివరి ఏకాదశి అంటే.. ఫాల్గుణమాసం.. కృష్ణ పక్షం ఏకాదశి పాపవిమోచన ఏకాదశి అంటారు.  ఈ ఏడాది పాప విమోచన ఏకాదశి మార్చి 25 నవ జరుపకుంటున్నాయము.  పాపమోచిని ఏకాదశి   వ్రత కథ ఏంటి? అనేది తెలుసుకుందాం.

కలియుగంలో మానవులు.. వారి జీవన విధానంలో అనేక పాపాలు చేస్తారు.  కొన్ని తెలిసి చేస్తే.. మరికొన్ని తెలియకుండానే చేస్తుంటాం.  అలాంటి పాపాల నుంచి విముక్తి పొందాలంటే ఈ ఏకాదశి ( మార్చి 25) పాపవిచమోచని ఏకాదశి వ్రతంచేయాలని పురాణాలు చెబుతున్నాయి. ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. హోలీ పండుగ, చైత్ర నవరాత్రుల మధ్య వచ్చే ఏకాదశిని పాపమోచిని ఏకాదశి అంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది వచ్చే చివరి ఏకాదశి కూడా ఇదే. 

పాపవిమోచిని ఏకాదశిరోజున ( మార్చి 25)  విష్ణువు, లక్ష్మీదేవిని పూజిస్తారు.  పాపమోచిని ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే సకల పాపాల నుంచి విముక్తి లభించి  మోక్షం పొందుతారని పండితులు చెబుతున్నారు.  ఆరోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తే బ్రాహ్మణ హత్య, దొంగతనం, అహింస వంటి పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. ఎవరైతే శ్రీమహా విష్ణువును పూజిస్తారో వాళ్ళకు పూర్వజన్మ పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని పురాణాలద్వారా తెలుస్తుంది. .

పురాణాల ప్రకారం అర్జునుడికి పాపమోచిని ఏకాదశి ఉపవాస ప్రాముఖ్యతను శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు. తెలిసీ తెలియకుండా చేసిన పాపాలను తొలగించుకోవడం కోసం పాపమోచిని ఏకాదశి వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల మనిషికి ఉన్న అన్ని పాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి.

ఏకాదశి రోజు ఉపవాసం ఉండి, వ్రత కథ చదువుకోవడం వల్ల పాపాల నుంచి విముక్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈరోజు పూజలో తప్పనిసరిగా విష్ణువుకి తులసిని భోగంగా సమర్పిస్తారు. అయితే ఏకాదశి రోజు పొరపాటున కూడా తులసి ఆకులు తెంపకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేరు. ధననష్టం జరుగుతుంది.

పాపమోచిని ఏకాదశి వ్రతం కథ

పూర్వం రుషి చ్యవనుడు ఉండేవాడు. అతని కుమారుడు మేధావి అందంగా శారీరకంగా బలంగా ఉంటాడు. తన మానసిక, శారీరక స్వచ్ఛతను కాపాడుకోవడం కోసం నిరంతరం తపస్సు చేస్తూ ఉండేవాడు. అయితే తన తపస్సుకు భంగం కలిగించాలని ఇంద్రుడు భావిస్తాడు. అతని దృష్టిని మరల్చడం కోసం అప్సరసలను భూలోకానికి పంపిస్తాడు. కానీ మేధావి చేస్తున్న తపస్సు మీద వారి ప్రభావం పడలేదు.

అప్సరసల్లో ఒకరైన మంజుఘోష మేధావి అందానికి ఆకర్షితురాలు అవుతుంది. ఎలాగైనా తనని సొంతం చేసుకోవాలని అతని ఆశ్రమానికి సమీపంలోనే నివసించింది. తన మధురమైన గానంతో పాటలు పాడుతూ ఉండేది. అది వినడంతో మేధావి ఆమె పట్ల ఆకర్షితుడు అవుతాడు. ధ్యానానికి భంగం వాటిల్లుతుంది. అది గమనించిన ఇంద్రుడు మన్మథుడిని తన పూలబాణంతో మేధావి మనసులో కోరికలు కలిగేలా చేస్తాడు.

మన్మథుడి ప్రభావంతో మేధావి ఆమెతో ప్రేమలో పడతాడు. కొన్ని సంవత్సరాల పాటు మేధావి మంజుఘోష కలిసి ఉంటారు. అయితే కొన్ని రోజుల తర్వాత మంజుఘోష తాను వెళ్లిపోవాలని చెబుతుంది. దీంతో మేధావి తను చేసిన తప్పును తెలుసుకుంటాడు. ఆమె చర్యలకు కోపోద్రిక్తుడై విశ్వంలోనే అత్యంత వికారమైన మహిళగా మారిపోతావని శపిస్తాడు.

తాను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని మేధావి తన తండ్రి రుషి చ్యవనుడిని ఆశ్రయిస్తాడు. పాపం నుంచి విముక్తి పొందాలంటే పాపమోచిని ఏకాదశి వ్రతం ఆచరించాలని మేధావికి సూచిస్తాడు. ఈ వ్రతం మంజుఘోష కూడా ఆచరించాలని చెప్తాడు. దీంతో ఇద్దరూ ఈ వ్రతం ఆచరిస్తారు. పాపమోచిని ఏకాదశి వ్రతం పాటించడం వల్ల విష్ణువు దయతో వారిద్దరూ చేసిన పాపాలు తొలగిపోయాయి.