‘ఆజ్ కీ రాత్’ అంటూ ‘స్త్రీ 2’ చిత్రంలోని స్పెషల్ సాంగ్తో ఇటీవల బాలీవుడ్ ఆడియెన్స్ను ఆకట్టుకున్న తమన్నా.. మరో హిందీ ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. అయితే ఈసారి థియేటర్స్కు కాకుండా నేరుగా ఓటీటీ ద్వారా పలకరించబోతోంది. తమన్నా, జిమ్మి షెర్గిల్, అవినాష్ తివారీ లీడ్ రోల్స్లో ‘సికందర్ కా ముకద్దర్’ అనే చిత్రం తెరకెక్కుతోంది. నీరజ్ పాండే దీనికి దర్శకుడు.
బుధవారం మేకింగ్ సీన్స్తో కూడిన ఓ వీడియోను విడుదల చేశారు మేకర్స్. అరవై కోట్ల విలువైన వజ్రం చుట్టూ తిరిగే ఈ క్రైమ్ థ్రిల్లర్.. నెట్ ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇందులో తమన్నా పవర్ఫుల్ క్యారెక్టర్లో నటిస్తున్నట్టు మేకింగ్ విజువల్స్ను బట్టి అర్థమవుతోంది. త్వరలో స్ట్రీమింగ్ డేట్ను అనౌన్స్ చేయనున్నారు. ఇక ప్రస్తుతం తెలుగులో ‘ఓదెల 2’ అనే చిత్రంలో ఆమె నటిస్తోంది. సంపత్ నంది నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆమె నాగ సాధువుగా కనిపించబోతోంది.