
పోటీ పరీక్ష ఏదైనా స్పోర్ట్స్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. త్వరలో జరగనున్న పోలీస్ పరీక్షలతో పాటు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో క్రీడల నుంచి 2 నుంచి 3 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ప్రతి నాలుగేండ్లకు ఒక్కసారి జరిగే ఒలింపిక్స్, పారాలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్ ఇటీవల జరిగాయి. వీటిపై ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. టోర్నీ జరిగిన ప్రదేశం, విజేతలు, వంటి ప్రశ్నలు మాత్రమే వస్తాయి. ఒలింపిక్స్, పారాలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడలపై విభిన్న కోణంలో ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంది.
కామన్వెల్త్ క్రీడలు
1930లో తొలిసారి కెనడాలోని హామిల్టన్లో జరిగాయి. 1998లో తొలిసారి ఆసియా నగరం కౌలాలంపూర్(మలేషియా)లో జరిగాయి. 2010లో న్యూఢిల్లీ కేంద్రంగా భారత్ ఈ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. 2020లో బర్మింగ్హమ్(ఇంగ్లాండ్) వేదికగా జరిగాయి. డర్బన్(దక్షిణాఫ్రికా) ఆర్థిక కారణాలతో వైదొలగగా బర్మింగ్హమ్కు అవకాశం దక్కింది. 2026లో ఆస్ట్రేలియాలోని విక్టోరియా నగరంలో జరగనున్నాయి.
ఆసియా క్రీడలు
1951లో న్యూఢిల్లీలో ప్రారంభం. వీటినే Asiadగా పిలుస్తారు.2018లో ఇండోనేషియాలో జకార్తా అండ్ పాలెంబంగ్ నగరాల్లో జరిగాయి.
ఆసియా క్రీడలు 2023 సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 3 వరకు హాగ్జీ (చైనా) వేదికగా జరగనున్నాయి.
మోటో: Heart to Heart , @ Future
2026 – ఏచి నగోయ (జపాన్), 2030 – దోహ (ఖతార్), 2034 – రియాద్ (సౌదీ అరేబియా)
ఒలింపిక్స్
ఒలింపిక్స్ 2020
2021 జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో వేదికగా జరిగాయి. జపాన్ రాజు నరుహిటో ప్రారంభించగా జపాన్ టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా జ్యోతి ప్రజ్వలన చేసింది. మొత్తం 206 దేశాలు పాల్గొన్నాయి. 33 క్రీడల్లో 339 క్రీడాంశాల్లో పోటీలు జరగ్గా 11,420 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. టోక్యో ఒలింపిక్స్ మోటో United by Emotion మస్కట్ Miraitowa. 2020 టోక్యో(జపాన్) ఈ ఒలింపిక్స్ 2021లో జరిగినప్పటికీ వీటిని 2020 ఒలింపిక్స్గానే వ్యవహరించాలని ఇంటర్నేషనల్ కమిటీ పేర్కొంది.
2020లో భారత్ స్థానం
18 క్రీడాంశాల్లో 126 మంది భారతీయ క్రీడాకారులు పాల్గొన్నారు. భారత పతాకధారులుగా ప్రారంభోత్సవంలో మేరికోం(బాక్సింగ్), మన్ ప్రీత్సింగ్(హాకీ) వ్యవహరించగా, ముగింపు ఉత్సవాల్లో భజరంగ్ పూనియా(రెజ్లింగ్) వ్యవహరించారు. ఈ ఒలింపిక్స్లో స్వర్ణం సాధించడం ద్వారా ఒలింపిక్స్ చరిత్రలో అథ్లెటిక్స్లో పతకం సాధించిన ఏకైక భారతీయుడిగా నీరజ్చోప్రా నిలిచాడు. ఆగస్టు 8ను జాతీయ జావెలిన్ త్రో దినోత్సవంగా ప్రకటించింది.
2021 ఆగస్టు 5న జర్మనీని ఓడించడం ద్వారా కాంస్యం పొందిన హాకీలో కాంస్యం పొందిన భారత పురుషుల జట్టు 41 సంవత్సరాల తర్వాత పతకం సాధించింది. ఈ జట్టుకు మన్ప్రీత్సింగ్ కెప్టెన్గా వ్యవహరించాడు. 1980 మాస్కో ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు చివరిసారిగా స్వర్ణం సాధించింది. ఒలింపిక్స్ చరిత్రలో భారత హాకీ జట్టు 8 స్వర్ణాలు, 1 రజతం, మూడు కాంస్యాలు సాధించింది.
2024 పారిస్(ఫ్రాన్స్) లండన్ (1908, 1948, 2012) తర్వాత అత్యధికంగా మూడు సార్లు ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చిన నగరంగా ఫ్రాన్స్ ప్రత్యేకత పొందనుంది. 1924 ఒలింపిక్స్ జరిగి 2024 నాటికి 100 ఏళ్లు పూర్తికానున్నాయి. 2024 పారిస్ క్రీడల నినాదం Games wide Openగా ప్రకటించారు. 2028లో లాస్ఏంజిల్స్(అమెరికా), 2032 బ్రిస్బేన్(ఆస్ట్రేలియా)లో జరగనున్నాయి.
పారాలింపిక్స్
దివ్యాంగుల కోసం ఉద్దేశించిన ఈ క్రీడలు తొలిసారి 1960లో రోమ్ (ఇటలీ)లో నిర్వహించారు. 1968 టెలిఅవివ్ (ఇజ్రాయెల్)లో జరిగిన పారాలింపిక్స్లో భారత్ తొలిసారి పాల్గొంది.
పారాలింపిక్స్- 2020
2021 ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరిగాయి. మోటో: Unite by emotions, మస్కట్: Someity, పాల్గొన్న దేశాలు 162( శరణార్థుల ఒలింపిక్స్ కమిటీ, రష్యన్ ఒలింపిక్స్ కమిటీ కలుపుకొని) పాల్గొన్నది 4403 మంది క్రీడాకారులు.
ఇండియా ప్లేస్
9 క్రీడాల్లో 54 మంది భారత క్రీడాకారులు పోటీ పడ్డారు. భారత పతాకధారిగా టెక్చంద్ (షాట్ఫుట్, జావెలిన్త్రో) వ్యవహరించగా, ముగింపు ఉత్సవాల్లో అవని లేఖరా(షూటింగ్) వ్యవహరించారు. 5 స్వర్ణం, 8 రజతం, 6 కాంస్య పతకాలతో పతకాల పట్టికలో భారత్ 24వ ర్యాంకులో నిలిచింది. అవని లేఖరా 10 మీటర్ల రైఫిల్లో స్వర్ణం, 50 మీటర్ల రైఫిల్లో కాంస్యం సాధించింది. 2021లో మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న, 2022లో పద్మశ్రీకి ఎంపికయ్యారు. బేటీబచావో బేటీ పఢావో రాజస్తాన్ రాష్ట్ర ప్రచారకర్తగా అవని లేఖరా ఎంపికయ్యారు. 2028లో లాస్ ఏంజిల్స్, 2032లో బ్రిస్బేన్(ఆస్ట్రేలియా)లో జరగనున్నాయి.
వింటర్ ఒలిపిక్స్-2022
2022 ఫిబ్రవరి 4 నుంచి 20 వరకు చైనాలోని బీజింగ్ వేదికగా జరిగాయి. ఈ క్రీడల్లో భారత్ పతాకధారిగా వ్యవహరించిన ఆరిఫ్ఖాన్ ఒక్కడే పాల్గొన్నాడు. జమ్ముకశ్మీర్కు చెందిన ఇతను అల్పైన్ స్కేయింగ్ క్రీడకు చెందిన వ్యక్తి. హిమాచల్ప్రదేవ్కు చెందిన బ్యాట్ క్రీడకు చెందిన శివకేశవన్ అత్యధికంగా ఆరుసార్లు వింటర్ ఒలింపిక్స్లో పాల్గొన్నాడు.
కామన్వెల్త్ గేమ్స్-2022
2022 జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లండ్లో జరిగాయి.
వేదిక: బర్మింగ్హమ్(ఇంగ్లండ్)
మోటో: Sport is just the beginning
మస్కట్: Perry, పాల్గొన్న దేశాలు: 72
క్రీడాకారులు: 774, క్రీడలు: 20 (క్రీడాంశాలు 280) , ప్రధాన వేదిక: అలెగ్జాండర్ స్టేడియం
నాలుగో స్థానంలో భారత్..
భారత పతాకధారులుగా ప్రారంభ ఉత్సవాల్లో మన్ప్రీత్సింగ్ (హాకీ), పి.వి.సింధు(బ్యాడ్మింటన్) వ్యవహరించారు. ముగింపు ఉత్సవాల్లో నికత్జరీన్ (బాక్సింగ్), ఆచంట శరత్ కమల్(టేబుల్ టెన్నిస్) వ్యవహరించారు. కామన్వెల్త్ క్రీడల్లో 201 మంది భారత క్రీడాకారులు 16 క్రీడల్లో పోటీ పడ్డారు. 61 పతకాల( 22 స్వర్ణం, 16 రజతం, 23 కాంస్యం)తో పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. అత్యధికంగా రెజ్లింగ్ 12, వెయిట్ లిఫ్టింగ్ 10, అథ్లెటిక్స్ 8, టేబుల్ టెన్నిస్ 7, బాక్సింగ్ 7, బ్యాడ్మింటన్ 6, జుడో 3, లాన్స్బేల్స్, స్క్వాష్ 2, హాకీ 2, క్రికెట్ 1, పవర్ లిఫ్టింగ్ 1 పతకం పొందింది.