
కోహెడ, వెలుగు: మండలంలోని కూరెల్ల గ్రామ శివారులో జరిగే సింగరాయ జాతరపై కూరెల్ల,తంగళ్లపల్లి గ్రామాల మధ్య పదేండ్లుగా సరిహద్దు వివాదం నడుస్తోంది. కాగా ఈనెల 9న జాతర జరగనుండగా.. పోలీస్, రెవెన్యూ అఫీసర్లు ఇరు గ్రామాల వారితో బుధవారం తహసీల్దార్ ఆఫీస్లో సమావేశం నిర్వహించారు. పదేండ్ల నుంచి జాతర సరిహద్దును ఎందుకు పరిష్కరించడం లేదని అధికారుల తీరుపై ఇరు గ్రామాల ప్రజలు అసహనం వ్యక్తం చేశారు.
సరిహద్దు సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈసారి కూడా రెవెన్యూ, పోలీస్ ఆధ్వర్యంలోనే జాతరను నిర్వహిస్తామని అధికారులు చెప్పారు. ఇందుకు ఇరు గ్రామాల వారు సహకరించాలని కోరారు. జాతర అనంతరం సరిహద్దు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధికారులకు సహకరించి జాతరను సక్సెస్ చేయాలని కోరారు. ఈ సమావేశంలో తహసీల్దార్ సురేఖ, సీఐ కిరణ్, ఎస్ఐ తిరుపతి, ఎంపీపీ కీర్తి, ఎంపీవో సురేశ్, ఎంపీటీసీ స్వామి తదితరులు ఉన్నారు.