ముగిసిన సింగరేణి జోనల్ మైన్స్ రెస్క్యూ  పోటీలు

ముగిసిన సింగరేణి జోనల్ మైన్స్ రెస్క్యూ  పోటీలు
  •    విజేతగా ఆర్జీ 2, 3, ఏపీఏ జట్టు

గోదావరిఖని, వెలుగు : సింగరేణి 53వ జోనల్​స్థాయి మైన్స్​రెస్క్యూ పోటీలు గురువారం రాత్రి ముగిశాయి. రెండు రోజులు జరిగిన పోటీల్లో ఆర్జీ 2, 3, ఏపీఏ జట్టు ఓవరాల్​ఛాంపియన్​షిప్​సాధించి విజేతగా నిలిచింది. రన్నరప్​కప్​ను భూపాలపల్లి జట్టు కైవసం చేసుకుంది. మూడో ప్లేసులో మందమర్రి, బెల్లంపల్లి జట్టు నిలిచింది. యైటింక్లయిన్​ కాలనీలోని రెస్క్యూ స్టేషన్​లో జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్​ సెంట్రల్​జోన్​డైరెక్టర్​ఆఫ్​ మైన్స్​సేప్టీ ఉమేశ్​ఎం.సావర్కర్, సింగరేణి డైరెక్టర్​జి.వెంకటేశ్వర్​రెడ్డి హాజరై విజేతలకు కప్​లను అందజేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణిలో ప్రమాదాలను తగ్గించేలా టెక్నాలజీని వాడుకోవాలని సూచించారు. భవిష్య త్ లో ప్రమాదాలు లేని కంపెనీగా సింగరేణిని రూపొందించాలని పేర్కొన్నారు. పోటీల్లో బెస్ట్​ రెస్క్యూ రిలేగా ఆర్జీ 1 జట్టు, బెస్ట్​ స్టాట్యూటరీగా శ్రీరాంపూర్​జట్టు, థియరీ స్టాట్యూటరీగా ఆర్జీ 2, 3, ఏపీఏ జట్టు, డ్రిల్​అండ్​పరేడ్​లో ఆర్జీ1 జట్టు, ఫస్ట్​ ఎయిడ్​లో మందమర్రి జట్టు, ఫ్రెష్​ ఎయిర్​ బేస్​లో ఇల్లందు, మణుగూరు, కొత్తగూడెం జట్టు, బెస్ట్​రికవరీలో మందమర్రి, బెల్లంపల్లి జట్టు ఉత్తమ ప్రతిభను చూపి బహుమతులను సాధించాయి.

ఫస్ట్​ బెస్ట్​ కేప్టెన్​గా కుదిరె అనిల్​, సెకండ్​ బెస్ట్ కేప్టెన్​గా కె.పూర్ణ చందర్​ నిలిచారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంఎస్​ జార్జ్​జాన్​, ఏఐటీయూసీ జనరల్​సెక్రటరీ కె.రాజ్​కుమార్, ఐఎన్​టీయూసీ సీనియర్​వైస్​ ప్రెసిడెంట్​పి.ధర్మపురి, సింగరేణి ఆఫీసర్ల సంఘం వైస్​ ప్రెసిడెంట్​పొనుగోటి శ్రీనివాస్, జనరల్​మేనేజర్లు చింతల శ్రీనివాస్, ఎల్​వి సూర్యనారాయణ, కె.శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వర్లు, రెస్క్యూ స్టేషన్​సూపరింటెండెంట్ మాధవరావు, తదితరులు పాల్గొన్నారు.