సొంతింటి పథకం అమలు చేయాలి

సొంతింటి పథకం అమలు చేయాలి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలని సింగరేణి కాలరీస్​ ఎంప్లాయీస్ యూనియన్​రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింహరావు అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం కొత్తగూడెంలోని సింగరేణి హెడ్​ఆఫీస్​లో జీఎం కవితనాయుడును కలిసి వినతిపత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిపెండెంట్​ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలన్నారు. కొత్తగూడెం, గోదావరిఖని, రామకృష్ణపూర్ ఏరియాల్లో సూపర్​స్పెషాలిటీ హాస్పిటల్స్​ ఏర్పాటు చేయాలని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో నాయకులు రాజారావు​, వై.వెంకటేశ్వరరావు, కార్మికులు ఉన్నారు.