కొత్త అండర్ గ్రౌండ్ గనులతోనే సింగరేణికి మనుగడ: సీతారామయ్య

కొత్త అండర్ గ్రౌండ్ గనులతోనే సింగరేణికి మనుగడ: సీతారామయ్య

కోల్​బెల్ట్, వెలుగు: గడిచిన పదేండ్ల కాలంలో కొత్తగా ఒక్క గనిని ఏర్పాటు చేయలేదని సింగరేణి కాలరీస్​వర్కర్స్ యూనియన్​(ఏఐటీయూసీ) జనరల్​సెక్రటరీ వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. కొత్త అండర్ గ్రౌండ్​ బొగ్గు గనులపైనే , సింగరేణి మనుగడ ఆధారపడి ఉందని పేర్కొన్నారు. మంగళవారం మందమర్రిలోని సింగరేణి సీఈఆర్ క్లబ్​లో నిర్వహించిన ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచి 9వ మహాసభకు ఆయన చీఫ్​గెస్ట్​గా హాజరై మాట్లాడారు. 

సింగరేణిలో లాభాలు, ఉత్పత్తి పెరిగినా అది టెంపరరీ మాత్రమేనని, కొత్త అండర్​గ్రౌండ్ గనులు రాకపోతే భవిష్యత్తులో తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. బొగ్గు బ్లాక్​ల వేలం పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త గనులను ప్రైవేటువాళ్లకు అమ్ముతుందని, సింగరేణిలో అండర్​గ్రౌండ్​మైన్లను రాష్ట్ర సర్కార్​ మూసివేస్తూ ఓపెన్ ​కాస్ట్​గనులను ప్రోత్సాహిస్తోందని మండిపడ్డారు. సింగరేణికి సంబంధించి వేల కోట్ల ఫండ్స్​ను రాష్ట్ర సర్కార్​వివిధ స్కీంల పేరుతో తరలించుకపోతుందన్నారు. సింగరేణి ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్​ డాక్టర్లు, మందుల కొరత ఉందన్నారు. 11వ వేజ్​బోర్డు 23 నెలల ఏరియర్స్​ఆగస్టు జీతంతో కలిపి సెప్టెంబర్​లో ఇవ్వాలని డిమాండ్​ చేశారు.
 
బ్రాంచి కమిటీ ఎన్నిక

మందమర్రి బ్రాంచి ఏఐటీయూసీ యూనియన్​నూతన కమిటీని ఎన్నుకున్నట్లు సీతారామయ్య తెలిపారు. బ్రాంచి సెక్రటరీగా సలెంద్ర సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్​గా భీమనాధుని సుదర్శనం, అసిస్టెంట్​సెక్రటరీ సొమిశెట్టి రాజేశం, జాయింట్​సెక్రటరీ కంది శ్రీనివాస్, మైనింగ్​ స్టాఫ్​ సెక్రటరీ గొపతి సత్యనారాయణ, కాంట్రాక్ట్​ వర్కర్స్​సెక్రటరీ జెట్టి మల్లయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీలు పెద్దపల్లి బానయ్య, గాండ్ల సంపత్, దినేశ్​ను ఎన్నుకున్నారు. సమావేశంలో ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె.వీరభధ్రయ్య, జిల్లా ప్రెసిడెంట్​ఎండీ అక్బర్​అలీ ​ తదితరులు పాల్గొన్నారు.