కేకే ఓసీపీలో సింగరేణి డైరెక్టర్ తనిఖీలు

కేకే ఓసీపీలో సింగరేణి డైరెక్టర్ తనిఖీలు

​కోల్ బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియా కల్యాణిఖని ఓపెన్​కాస్ట్ మైన్​ను సింగరేణి డైరెక్టర్​(ప్లానింగ్, ప్రాజెక్ట్, పా) కె.వెంకటేశ్వర్లు ఆదివారం సందర్శించారు. ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, ఓవర్​బర్డెన్ ​వెలికితీత పనులను తనిఖీ చేశారు. అనంతరం నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో పాల్గొని మాట్లాడుతూ.. బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధనకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డైరెక్టర్​ను ఘనంగా సన్మానించారు. 

మందమర్రి ఏరియా జీఎం జి.దేవేందర్, బెల్లంపల్లి రీజియన్​ సేఫ్టీ జీఎం రఘుకుమార్, ఏరియా ఎస్వోటుజీఎం ఎం.విజయప్రసాద్, కేకే ఓసీపీ పీవో మల్లయ్య, కేకే గ్రూప్​ఏజెంట్​రాంబాబు, ఏరియా ఇంజనీర్ వెంకటరమణ, సేఫ్టీ ఆఫీసర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.