సింగరేణి ఉద్యోగికి సిల్వర్​ మెడల్​

సింగరేణి ఉద్యోగికి సిల్వర్​ మెడల్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఆల్​ఇండియా పబ్లిక్​ సెక్టార్​ అథ్లెటిక్​ మీట్​లో సింగరేణి ఉద్యోగి కె. మన్విత సిల్వర్​ మెడల్​ సాధించి కంపెనీ తరఫున రికార్డు సృష్టించారు. ఉత్తరాఖండ్​ రాష్ట్రంలోని డెహ్రాడూన్​లోని మహారాణా ప్రతాప్​ స్పోర్టోస్​ కాలేజీలో ఆల్​ ఇండియా పబ్లిక్​ సెక్టార్​ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ పోటీలు కొనసాగనున్నాయి.

మొదటిరోజే మాన్విత షాట్​ఫుట్​ విభాగంలో సిల్వర్​ మెడల్​ సాధించిన సింగరేణి తరఫున మొదటి క్రీడాకారిణి కావడం విశేషం. సిల్వర్​ మెడల్​ సాధించిన మన్వితను కంపెనీ చైర్మన్, మేనేజింగ్​ డైరెక్టర్​ ఎన్.బలరాంతో పాటు డైరెక్టర్లు, పలువురు జీఎంలు, ఎస్టేట్​ ఆఫీసర్లు అభినందనలు తెలిపారు.