డ్యూటీ చేయకపోతే ఉద్యోగ భద్రతకు ముప్పు :  జీఎం జి.దేవేందర్​

డ్యూటీ చేయకపోతే ఉద్యోగ భద్రతకు ముప్పు :  జీఎం జి.దేవేందర్​
  • మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్​

కోల్ బెల్ట్​, వెలుగు: సింగరేణి సంస్థలో ఉద్యోగం దక్కడం అదృష్టమని, సక్రమంగా డ్యూటీలు చేయకపోతే ఉద్యోగ భద్రతకు ముప్పు ఉంటుందని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్​ అన్నారు. మంగళవారం మందమర్రి జీఎం ఆఫీస్​లో మెడికల్​ ఇన్వాలిడేషన్​ డిపెండెంట్లకు కారుణ్య నియామకం ద్వారా జాయినింగ్​ ఆర్డర్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఏరియాలో కారుణ్య నియామకాల ద్వారా 1972 మంది యువతీ యువకులకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు.

అనంతరం ఎంబీబీఎస్​, ఇంజనీరింగ్​ చదువుతున్న కేకే ఓసీపీ ఈపీ ఆపరేటర్​ నూనె సాంబయ్య కూతుళ్లు నూనె పావని,  జననీలకు మెరిట్​ స్కాలర్​షిప్​ కింద రూ.20 వేలు  అందజేశారు.  కార్యక్రమంలో సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ మందమర్రి, బెల్లంపల్లి బ్రాంచి సెక్రటరీలు సలెంద్ర సత్యనారాయణ, దాగం మల్లేశ్​, పర్సనల్​ మేనేజర్​ శ్యాంసుందర్​, సింగరేణి ఆఫీసర్స్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్​ రమేశ్, డీవైపీఎం సత్యబోసు,  ఓఎస్​ రాజలింగు పాల్గొన్నారు.