డంపుయార్డ్‌‌‌‌‌‌‌‌ స్థలం పరిశీలించిన సింగరేణి జీఎం

డంపుయార్డ్‌‌‌‌‌‌‌‌ స్థలం పరిశీలించిన సింగరేణి జీఎం
  • ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో పరిశీలన 

కోల్​బెల్ట్,వెలుగు:​ రామకృష్ణాపూర్​ పట్టణ శివారులోని మూసివేసిన సింగరేణి టింబర్​యార్డ్​ ఎదుట ఉన్న స్థలాన్ని మంగళవారం మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్​ పరిశీలించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో డంప్​యార్డ్​ కోసం 10 ఎకరాల  స్థలాన్ని కేటాయించాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ఇప్పటికే  సింగరేణి యాజమాన్యాన్ని కోరారు.

ఎమ్మెల్యే ఆదేశాల నేపథ్యంలో జీఎం, ఎస్టేట్​ ఆఫీసర్​ వెంకటరెడ్డి​ తదితరులు ప్రతిపాదిత స్థలాన్ని చూశారు. శ్మశాన వాటిక కోసం కేటాయించే అవకాశం ఉన్న మరో 5 ఎకరాల స్థలాన్ని కూడా పరిశీలించారు. మైనింగ్​ సర్వే అనంతరం డంప్​ యార్డ్​, శ్మశాన వాటికకు సింగరేణి యాజమాన్యం స్థలాలను కేటాయించే ఛాన్స్​ఉంది.  సింగరేణి ఎస్అండ్​పీసీ  సీనియర్​ఇన్స్​పెక్టర్​ సుంకరి రమేశ్​, జమేదార్​ రాజయ్య  పాల్గొన్నారు.