
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రిలోని సింగరేణి హైస్కూల్లో 2025–26 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం అడ్మిషన్లు ప్రారంభమయ్యాని కరస్పాండెంట్, ఏరియా సింగరేణి పర్సనల్మేనేజర్ఎస్.శ్యాంసుందర్, స్కూల్హెచ్ఎం జె.పురుషోత్తం గురువారం తెలిపారు. జూన్30 వరకు ఆడ్మిషన్లు జరుగుతాయన్నారు.
మందమర్రి ఏరియా సింగరేణి ఉద్యోగులు, నిర్వాసిత ప్రాంతాల ప్రజల పిల్లలు స్కూల్లో చేరేందుకు అవకాశం ఉందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్కూల్లో నేరుగా ఆడ్మిషన్లు పొందవచ్చన్నారు.