
- సంస్థ చరిత్రలోనే తొలిసారిగా నియామకం
- ఉత్తర్వులు జారీ చేసిన యాజమాన్యం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగ రేణి చరిత్రలోనే తొలిసారిగా బీసీ లైజన్ ఆఫీసర్ల నియామకాలకు మేనేజ్ మెంట్ శ్రీకారం చుట్టింది. ఏరియాల వారీగా బీసీ లైజన్ఆఫీసర్ల నియామక ఉత్తర్వులను మంగళవారం జారీ చేసింది. కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా బీసీ లైజన్ఆఫీసర్గా ఎస్వోఎంవి.
మురళి, కొత్తగూడెం ఏరియాలో ఎస్ఈ అవదూత శ్రీధర్, ఇల్లెందు ఏరియాలో ఈఈ జి. నాగశేషు, మణుగూరులో డీజీఎం పి. వీరభద్రారావు, ఆర్జీ–1 ఏరియాలో అడిషనల్మేనేజర్ పి. శ్రీనివాస్, ఆర్జీ–2 ఏరియాలో ఎస్ఈ పి. వేణుగోపాల్, ఆర్జీ–3 ఏరియాలో డీజీఎం కె. చంద్రశేఖర్, భూపాలపల్లి ఏరియాలో డీవైఎస్ఈ పి. బాలరాజు, బెల్లంపల్లి ఏరియాలో డీవై సీఎంఓ ఎం. మధుకుమార్, మందమర్రి ఏరియాలో అడిషనల్మేనేజర్ఎండీ, ముస్తాఫా, శ్రీరాంపూర్ ఏరియాలో డీజీఎం ఎన్. సత్యనారాయణను బీసీ లైజన్ ఆఫీసర్లుగా సింగరేణి నియమించింది.