జీవన్​ ప్రమాణ్ పత్రాలు ఇచ్చినా..పింఛన్​ జమ చేయరా?

జీవన్​ ప్రమాణ్ పత్రాలు ఇచ్చినా..పింఛన్​ జమ చేయరా?
  •     సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య

గోదావరిఖని, వెలుగు : జీవన్  ప్రమాణ్  పత్రాలు ఆన్ లైన్​లో అందజేసినా, సింగరేణి రిటైర్డ్  ఉద్యోగులకు ఫిబ్రవరి నెల ఫించన్​ ఎందుకు జమ చేయలేదని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రెసిడెంట్​ వాసిరెడ్డి సీతారామయ్య ప్రశ్నించారు. మంగళవారం గోదావరిఖని సీఎంపీఎఫ్​ ఆఫీస్​లో రీజినల్​ కమిషనర్​ హరి పచౌరీని కలిసి వివిధ సమస్యలపై చర్చించారు. 2021 జులై 1 నుంచి రిటైర్​ అయిన ఉద్యోగులకు సవరించిన ఫించన్, బకాయిలు చెల్లించాలన్నారు. 

జనవరి నుంచి నిలిపేసిన ఫించన్​ను వెంటనే బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్  చేశారు. వితంతు పెన్షన్ దారులు సైతం ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.  రిటైర్డ్  ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ధన్​బాద్​లోని సీఎంపీఎఫ్  కమిషనర్​కు లేఖ రాస్తామని తెలిపారు. శ్రీరాంపూర్  బ్రాంచ్​ కార్యదర్శి బాజీసైదా తదితరులు పాల్గొన్నారు.