ఎస్టీపీపీలో త్వరలోనే మూడో యూనిట్ పనులు : డి.సత్యనారాయణ రావు

ఎస్టీపీపీలో త్వరలోనే మూడో యూనిట్ పనులు : డి.సత్యనారాయణ రావు

జైపూర్, వెలుగు: జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్​లో (ఎస్టీపీపీ) మూడో యూనిట్ నిర్మించే స్థలాన్ని సింగరేణి డైరెక్టర్ (ఈ అండ్ ఎం) డి.సత్యనారాయణ రావు ఎస్టీపీపీ ఇన్​చార్జ్ ఈడీ కె.శ్రీనివాసులుతో కలిసి బుధవారం పరిశీలించారు. ఆయన  మాట్లాడుతూ త్వరలో ఎస్టీపీపీలో మూడో యూనిట్ పనులు ప్రారంభం కావచ్చని, అధికారులంతా సంసిద్ధంగా ఉండాలన్నారు.

ప్లాంటులోని  బాయిలర్ ఏరియాను పరిశీలించారు. పవర్ ప్రొడక్షన్​లో సమస్యలు లేకుండా పనిచేసేలా చూడాలని ఆదేశించారు. వేసవి నేపథ్యంలో విద్యుత్​కు డిమాండ్​ పెరుగుతుం దని, అందుకు సరిపడా ఉత్పత్తి చేయాలన్నారు. ఎస్టీపీపీలో ఏజీఎంగా పనిచేసి రిటైరైన సుధాకర్​ను సన్మానించారు. కార్యక్రమంలో ఓ అండ్ ఎం చీఫ్ జె.ఎన్ సింగ్, ఏజీఎం ప్రసాద్, డీజీడీఎం వేణుగోపాలరావు, సీఎంవో ఏఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ ఎస్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

భారీ యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి

నస్పూర్, వెలుగు: ఓసీసీ గనిలో భారీ యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సింగరేణి డైరెక్టర్ (ఈ అండ్ ఎం) సత్యనారాయణ అన్నారు. బుధవారం శ్రీరాంపూర్​లోని ఓసీపీని జీఎం శ్రీనివాస్​తో కలిసి పరిశీలించారు. గనిలో కోల్ ఎక్స్​పోజర్ ప్రదేశాలను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. కార్పొరేట్ జీఎం(సీహెచ్​పీ)  తిరుమల్ రావు, ఎస్వోటు జీఎం సత్యనారాయణ, ఏరియా ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి, శ్రీరాంపూర్ ఓసీపీ పీవో  శ్రీనివాస్, కార్పొరేట్ డీజీఎంలు కేశవరావు, రవీందర్, క్వాలిటీ ఇన్​చార్జ్ ​వెంకటేశ్వర్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.