కోలిండియా స్థాయి అథ్లెటిక్స్​ పోటీల్లో సింగరేణికి పది మెడల్స్​

కోలిండియా స్థాయి అథ్లెటిక్స్​ పోటీల్లో సింగరేణికి పది మెడల్స్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలో నిర్వహిస్తున్న కోలిండియా స్థాయి అథ్లెటిక్స్​ క్రీడా పోటీల్లో సింగరేణి కార్మికులు ఆరు మెడల్స్ ​సాధించారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో జరుగుతున్న అథ్లెటిక్స్​ క్రీడా పోటీల్లో సింగరేణితో పాటు దేశంలోని బీసీసీఎల్, సీసీఎల్, సీఎంపీడీఐ, ఎన్​సీఎల్, ఎస్​ఈసీఎల్, ఎంసీఎల్​, డబ్ల్యూ సీఎల్​ కంపెనీలకు చెందిన బొగ్గు గని కార్మిక క్రీడాకారులు పాల్గొన్నారు.

శని, ఆదివారాల్లో పోటీలు జరుగనున్నాయి. మొదటి రోజు జరిగిన పోటీల్లో సింగరేణికి చెందిన క్రీడాకారులు మూడు గోల్డ్, రెండు సిల్వర్, బ్రాంజ్​మెడల్​ కలిపి మొత్తం పది మెడల్స్​ సాధించారు. పోటీల్లో విజేతలకు జీఎం పర్సనల్​ కవితా నాయుడుతో పాటు గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల ప్రతినిధులు మిర్యాల రంగయ్య, త్యాగరాజన్​, పలువురు సింగరేణి ఆఫీసర్లు మెడల్స్​ అందజేశారు.