- హైదరాబాద్ నిమ్స్లో చికిత్స
పంజాగుట్ట, వెలుగు: ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్ గుండెపోటుకు గురయ్యారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్లో చేర్పించారు. నిమ్స్డైరెక్టర్ డాక్టర్ బీరప్ప పర్యవేక్షణలో మెట్టు రంగారెడ్డి వార్డులో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.
శనివారం సింగరేణికి చెందిన పలువురు అధికారులు జయరాజ్ను పరామర్శించారు. జయరాజన్న త్వరగా కోలుకుని ఇంటికి రావాలని గద్దర్ అభిమానుల సంఘం అధ్యక్షుడు సీఎల్యాదగిరి ఆకాంక్షిస్తూ ప్రకటన విడుదల చేశారు. కాగా.. జయరాజ్ ప్రస్తుతం సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన ఫ్యామిలీ సిటీలోని మోతీనగర్లో ఉంటోంది.