గాయకుడు జయరాజ్​కు గుండెపోటు

 గాయకుడు  జయరాజ్​కు గుండెపోటు
  • హైదరాబాద్ ​నిమ్స్​లో చికిత్స 

పంజాగుట్ట, వెలుగు: ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్‌‌ గుండెపోటుకు గురయ్యారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్​పంజాగుట్టలోని నిమ్స్‌‌ హాస్పిటల్​లో చేర్పించారు. నిమ్స్​డైరెక్టర్ డాక్టర్ బీరప్ప పర్యవేక్షణలో మెట్టు రంగారెడ్డి వార్డులో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. 

శనివారం సింగరేణికి చెందిన పలువురు అధికారులు జయరాజ్​ను పరామర్శించారు. జయరాజన్న త్వరగా కోలుకుని ఇంటికి రావాలని గద్దర్ అభిమానుల సంఘం అధ్యక్షుడు సీఎల్​యాదగిరి ఆకాంక్షిస్తూ ప్రకటన విడుదల చేశారు. కాగా.. జయరాజ్ ప్రస్తుతం సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన ఫ్యామిలీ సిటీలోని మోతీనగర్​లో ఉంటోంది.