శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌‌లో మహ్మద్ సిరాజ్‌కు ఘనస్వాగతం

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌‌లో మహ్మద్ సిరాజ్‌కు ఘనస్వాగతం

శంషాబాద్: టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించిన తర్వాత టీంఇండియా ప్లేయర్లు భారత్ చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రం భారత జట్టులో బౌలర్ సిరాజ్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నాడు. శుక్రవారం రోజు ఢిల్లీకి చేరుకొని ప్రధాని నరేంద్ర మోడీని కలిసి అనంతరం ముంబై బయలుదేరారు. ముంబైలో భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. తర్వాత ఢిల్లీ నుండి సిరాజ్ శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నాడు. శంషాబాద్ విమానాశ్రయనికి చేరుకున్న సిరాజ్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని ఆయన నివాసానికి చేరుకున్నాడు.