స్వర్ణకవచధారి సీతారామయ్య

స్వర్ణకవచధారి సీతారామయ్య

భద్రాచలం, వెలుగు : సీతారామచంద్రస్వామి మూలవరులను శుక్రవారం బంగారు కవచాలతో అలంకరించారు. ప్రత్యేక హారతులు సమర్పించారు. సుప్రభాత సేవ అనంతరం ఈ వేడుక జరిగింది. అంతకు ముందు లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు.

 లక్ష్మీ అష్టోత్తరశతనామార్చన, విష్ణుసహస్రనామ పారాయణం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. బేడా మండపంలో కల్యాణమూర్తులకు నిత్యకల్యాణం నిర్వహించారు. మాధ్యాహ్నిక ఆరాధనల అనంతరం దర్బారు సేవ జరిగింది. అద్దాల మండపంలో సీతారాములకు సంధ్యాహారతిని సమర్పించారు.