నైపుణ్య శిక్షణ.. భవితకు రక్షణ

నైపుణ్య శిక్షణ.. భవితకు రక్షణ
  • సింగరేణి ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగులకు స్కిల్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కోర్సులు
  • గోదావరిఖనిలో స్కిల్​డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్​ సెంటర్​ నిర్మాణం
  •  38 కోర్సుల్లో ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌, ఉపాధి  నేడు ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం భట్టి 

గోదావరిఖని, వెలుగు: సింగరేణి ప్రభావిత, పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువతతోపాటు కార్మికుల పిల్లలకు ఉపాధి కల్పించేందుకు మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్​ స్కిల్​ డెవలప్​మెంట్​ సెంటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. మొదటగా మంచిర్యాల జిల్లా మందమర్రిలో సెంటర్​ ఏర్పాటు చేయగా, రెండో సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రామగుండం రీజియన్​ పరిధిలోని గోదావరిఖని తిలక్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రూ.కోటి వ్యయంతో 10 గదులతో బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ నిర్మించారు. ఈ ట్రైనింగ్​ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 38 ఉపాధి  కోర్సులపై ట్రైనింగ్​ ఇచ్చేలా మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్​ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సెంటర్​ భవనాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం ప్రారంభించనున్నారు. 

ఉపాధి పొందేలా కోర్సులు 

డిగ్రీ, డిప్లోమా, ఐటీఐ, టెన్త్‌‌‌‌‌‌‌‌ చదివిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా హ్యూమన్​ రిసోర్స్​ డెవలప్​మెంట్​ విభాగం 38 కోర్సులను రూపొందించింది. కాగా ప్రస్తుతం మార్కెట్​లో ఎక్కువగా ఉపయోగపడే సోలార్​ టెక్నీషియన్‌‌‌‌‌‌‌‌, డ్రోన్​ టెక్నిషియన్​, కంప్యూటర్‌‌‌‌‌‌‌‌, డీటీపీ, ఆర్క్ వెల్డింగ్, గ్యాస్​ వెల్డింగ్​, కాస్మేటాలజీ, ఇంటర్నేట్​ ఆఫ్​ థింగ్స్​(ఐవోటీ), సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్, టూ వీలర్​ మెకానిక్‌‌‌‌‌‌‌‌.. వంటి కోర్సులను నేర్పించనున్నారు. శనివారం మాత్రం డిప్యూటీ సీఎం సోలార్, డ్రోన్​ టెక్నీషియన్‌‌‌‌‌‌‌‌ కోర్సులను ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు. 18 నుంచి 42 ఏండ్ల ఉన్నవారు ఈ కోర్సుల్లో చేరేందుకు అవకాశం కల్పించారు. 

యువతుల కోసం ప్రత్యేక కోర్సులు 

సింగరేణి ప్రభావిత, పరిసర ప్రాంతాల యువతుల కోసం కూడా ప్రత్యేకంగా కోర్సులను రూపొందించారు. ఎంబ్రాయిడరీ, టైలరింగ్, జ్యూట్, పేపర్​ బ్యాగ్స్​ తయారీ, ఫ్యాషన్​ డిజైనింగ్, డ్రాప్టింగ్, కటింగ్‌‌‌‌‌‌‌‌, స్టిచ్చింగ్​ కోర్సులు నేర్పించనున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత వారికి సర్టిఫికెట్లు ఇస్తారు. ఉపాధి పొందేందుకు అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్‌‌‌‌‌‌‌‌ కూడా నేర్పించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

ALSO READ : సంగారెడ్డిలో చెత్త సమస్యకు పరిష్కారమెప్పుడు?

ఎంవోయూ తర్వాత ట్రైనింగ్​ స్పీడప్‌‌‌‌‌‌‌‌

సింగరేణి ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగ యువత, కార్మికుల పిల్లలకు ఉద్యోగావకాశాలు కల్పించేలా ట్రైనింగ్​ ఇవ్వనున్నాం. సెంచేరియన్​ స్కిల్​ డెవలప్​మెంట్​ యూనివర్సిటీతో ఎంవోయూ కుదుర్చుకుంటున్నాం. ఆ ప్రక్రియ పూర్తయ్యాక ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌ను స్పీడప్‌‌‌‌‌‌‌‌ చేస్తాం. శిక్షణ కోసం అర్హులైన నిరుద్యోగులు తమ దరఖాస్తులను ఆర్జీ 1 జీఎం ఆఫీస్​లోని పర్సనల్ ​డిపార్ట్​మెంట్‌‌‌‌‌‌‌‌లో అందజేయాలి.   - డి.లలిత్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జీఎం, ఆర్జీ 1