ఎస్​ఎల్​బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్​: 22 వ రోజు రోబోలకు ప్రత్యేక యంత్రాలు అనుసంధానం

ఎస్​ఎల్​బీసీ టన్నెల్లో  రెస్క్యూ ఆపరేషన్​: 22 వ రోజు రోబోలకు ప్రత్యేక యంత్రాలు అనుసంధానం

ఎస్​ఎస్​బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్​ కొనసాగుతుంది.  టన్నెల్లో 8 మంది చిక్కుకుపోగా.. ఇప్పటికి ఒక మృతదేహాన్ని మాత్రమే వెలికితీశారు. 22 రోజులుగా ( మార్చి 15నాటికి )  రెస్క్యూ టీం డేంజర్​ జోన్​లో గాలింపు చర్యలు చేస్తూనే ఉన్నారు.  టీజీఎం కట్టర్​మిషన్​ కు ప్లాస్మా కట్టర్​లను బిగించి ప్రక్రియ ప్రారంభించారు.  ఎండ్​ పాయింట్​ నుంచి 50 మీటర్ల ముందుకు డేంజర్​ జోన్​ ఉన్నట్లు గుర్తించారు. 

ఎస్​ఎస్​బీసీ టన్నెల్లో చిక్కుకున్న  వారి ఆచూకి తెలుసుకునేందుకు రోబోలను కూడా ఉపయోగిస్తారు.  రోబోలకు ప్రత్యేక యంత్రాలను అనుసంధానం చేసి డేంజర్​ జోన్​ లో ఆపరేషన్​ ప్రక్రియను వేగవంతం చేశారు. ఎండ్​ పాయింట్లో డేంజర్​ రెస్క్యూ ఆపరేషన్​ కొనసాగిస్తున్నారు. లిక్విడ్​ రింగ్​ వ్యాక్యేమ్​ తో సిబ్బంది టన్నెల్ లోపలికి వెళ్లారు.  అయితే సిబ్బందికి డేంజర్​ జోన్​ లోనికి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం డీ-2 వద్ద తవ్వకాలను అధునాతన యంత్రాలతో కొనసాగుతున్నాయి.

Also Read : డీ2 ఆశలు గల్లంతు..వారం రోజులు కష్టపడి మట్టి, రాళ్లు తొలగించిన రెస్క్యూ టీమ్స్‌‌

 సింగరేణి రెస్క్యూ బృందాలు, ర్యాట్ మైనర్స్, ఎన్డీఆర్​ఎఫ్, ఎస్డీఆర్​ఎఫ్, హైడ్రా, దక్షిణ మధ్య రైల్వే, అన్వి రోబోటిక్స్, కేరళ కాడవర్ డాగ్స్, ఆర్మీతో కూడిన సహాయక బృందాలు నిత్యం శ్రమిస్తూనే ఉన్నాయి.మూడు చోట్ల పైకప్పు కూలకుండా టైగర్ కాగ్స్​ను ఏర్పాటు చేశారు. నిరంతరాయంగా డీ-వాటరింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.లోపల శిథిలాలు, మట్టి, బురద సహాయక చర్యలకు అడ్డంకిగా మారడంతోపాటు నీటి ఊట కొనసాగుతూ ఉండటంతో సహాయక బృందాలు జాగ్రత్తలు పాటిస్తూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.