
- పనులు వద్దని నివేదికలు
- కమిషన్ల కోసమే చేసిండ్రు
- ఘటనపై హైకోర్టు జడ్జితో విచారణ చేయండి
హైదరాబాద్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరుగుతుందని ముందే తెలిసిన ప్రభుత్వం నిజాలను దాచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఎస్ఎబీసీ టన్నెల్ ప్రమాదం జరుగుతుందని ముందే రెండు నివేదికలు హెచ్చరించిన ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ‘ కార్మికుల ప్రాణాలను పనంగా పెట్టి నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వం ముందుకు పోయింది.
టన్నెల్ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటిస్తూ గతంలో రెండు నివేదికలు ప్రభుత్వం వద్ద ఉన్న కేవలం కమిషన్ల కోసమే పనులను నిర్వహించింది. నివేదికల్లో చెప్పిన తీరుగా ఆ ప్రాంతంలోనే ప్రమాదం జరిగింది. 8 మంది కార్మికుల కుటుంబాల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి.
ALSO READ | SLBC టన్నెల్లో మృతదేహాలను గుర్తించేందుకు కేడావర్ డాగ్స్
అదేవిధంగా వేలకోట్ల ప్రజాధనం వృధా అయింది. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మొత్తం క్యాబినెట్ ఈ ప్రమాదానికి బాధ్యత వహించాలి. ఈ రెండు నివేదికల అంశంపైన ప్రభుత్వం స్పష్టతను ఇవ్వాలి. ఈ ఘటనపై హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపించాలని, ప్రాణాలు కోల్పోయిన ఎనిమిది కుటుంబాలతో పాటు రాష్ట్ర ప్రజల తరఫున ఈ అంశంపై పూర్తి వివరాలు విడుదల చేసి ప్రమాదానికి బాధ్యత తీసుకోవాలి’ అని కేటీఆర్ ట్వీట్చేశారు.