
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్లో హరీశ్ రావు స్థానం ఏంటో ఆయనకే తెలియదని, కానీ హరీశ్మాత్రం కేసీఆర్కు వారసుడినంటూ పగటి కలలు కంటున్నాడని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందే కేసీఆర్ అని, పడిపోయిన తెలంగాణను నిలబెట్టేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని అన్నారు.
బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ మీటింగ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అంటించిన ఆ పార్టీ పోస్టర్లలో హరీశ్ రావు ఫొటో ఎక్కడా లేదని, కేటీఆర్ బీఆర్ఎస్లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే హరీశ్ రాజకీయ కల చెదిరిపోయిందని అన్నారు. రాష్ట్రంలో బూతు పితామహుడు కేసీఆర్ అని, కండ్లు ఉండి చూడలేని కబోది హరీశ్ రావు అని మండిపడ్డారు. బీసీని కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ గా నియమించిందని, బీఆర్ఎస్ ప్రెసిడెంట్గానైనా, వర్కింగ్ ప్రెసిడెంట్గానైనా బీసీని నియమించగలరా? అని ప్రశ్నించారు. కేటీఆర్ కొందరికి కూలీ ఇచ్చి కంచె గచ్చిబౌలిపై తప్పుడు బొమ్మలు వేయించాడని ధ్వజమెత్తారు.