స్మార్ట్​ఫోన్ల అమ్మకాలు తగ్గినయ్.. డిమాండ్ ​2 శాతం డౌన్​

 స్మార్ట్​ఫోన్ల అమ్మకాలు తగ్గినయ్.. డిమాండ్ ​2 శాతం డౌన్​

న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్ క్వార్టర్​లో మనదేశ స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్ షిప్‌‌‌‌‌‌‌‌మెంట్లు వార్షికంగా రెండు శాతం పడిపోయాయి. ఎండలు ఎక్కువగా ఉండటం, తక్కువ గిరాకీ ఇందుకు కారణమని గ్లోబల్ రీసెర్చ్ సంస్థ కౌంటర్‌‌‌‌‌‌‌‌ పాయింట్ వెల్లడించింది. దీని రిపోర్ట్​ ప్రకారం, వాల్యూమ్ షేర్‌‌‌‌‌‌‌‌లో షావోమీ తిరిగి మొదటిస్థానాన్ని దక్కించుకుంది. విలువ పరంగా శామ్‌‌‌‌‌‌‌‌సంగ్ అగ్రస్థానంలో నిలిచింది.

 5జీ స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌లు మొత్తం షిప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లలో 77 శాతం ఉన్నాయి.  జనం ఎయిర్ కండిషనర్లు,  రిఫ్రిజిరేటర్‌‌‌‌‌‌‌‌ల వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వడంతో స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్లకు గిరాకీ తగ్గింది. ఈ క్వార్టర్​ షావోమీ 23 శాతం వార్షిక వృద్ధి సాధించింది. షిప్​మెంట్లలో దీని వాటా 18.9 శాతం, వివో వాటా 18.8 శాతం ఉంది.   శామ్​సంగ్ 25 శాతం వాటాతో విలువ పరంగా మార్కెట్‌‌‌‌‌‌‌‌లో అగ్రగామిగా ఉంది. తరువాత వివో,  ఆపిల్ ఉన్నాయి.