Smriti Mandhana: స్మృతి ప్రేమకు ఐదేళ్లు.. ఎవరీ పలాశ్‌ ముచ్చల్‌..?

Smriti Mandhana: స్మృతి ప్రేమకు ఐదేళ్లు.. ఎవరీ పలాశ్‌ ముచ్చల్‌..?

అటు ఆటతోనూ.. ఇటు అందంతోనూ.. ఎంతో మంది కుర్రాళ్ల మనసు దోచిన భారత మహిళా క్రికెటర్ స్మృతి మందాన తన ప్రేమ బంధాన్ని బయటపెట్టింది. పలాశ్‌ ముచ్చల్‌ అనే ఓ మ్యూజిక్ కంపోజర్‌‌తో తాను ప్రేమలో ఉన్నట్లు ప్రపంచానికి తేలియజేసింది. అక్కడితో ఈ జోడి ఆగలేదు. తమ ఐదేళ్ల ప్రేమకు గుర్తుగా కేక్‌ కట్‌ చేసుకొని సెలెబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె ప్రియుడు ముచ్చల్‌.. సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి వేలాది అభిమానుల హృదయాలను గాయపరిచాడు.

స్మృతి, పలాశ్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు గతంలోనే వార్తలొచ్చాయి. వీరిద్దరూ కలిసి ఉన్న పిక్స్​ఎన్నో సోషల్ మీడియాలో కనిపించాయి. అయినప్పటికీ అభిమానులెవరూ వాటిని నమ్మలేదు. నిత్యం బ్యాట్, బాల్‌తో పోటీ పడే స్మృతికి ఏం ప్రేమలు ఉంటాయిలే అనుకునేవారు. ఆ నమ్మకాన్ని భారత క్రికెటరమ్మ వమ్ము చేసింది. ప్రియుడితో ఐదేళ్ల ప్రేమ వసంతాన్ని పూర్తి చేసుకొని.. తనను ఆరాధించే వేలాది అభిమానుల హృదయాలను గాయపరిచింది. స్మృతి ఇప్పటికైనా ఈ రహస్యాన్ని బయటపెట్టడం ఒకరకంగా మంచిదే అనుకోవాలి. ఆమెను ప్రొఫైల్ పిక్‌లు పెట్టడం, లవ్ సింబల్ ఎమోజీలను జత చేయడం వీరాభిమానులు ఇకనైనా మానుకుంటారు.

ఎవరీ పలాశ్‌ ముచ్చల్‌..?

పలాష్ ముచ్చల్ 29 ఏళ్ల మ్యూజిక్ కంపోజర్, ఫిల్మ్ మేకర్. అతని సోదరి పాలక్ ముచ్చల్ బాలీవుడ్ గాయని. పలాశ్‌.. 'రిక్షా' అనే వెబ్ సిరీస్‌కి.. 'అర్ద్' అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇతను టీ సిరీస్, జీ మ్యూజిక్ కంపెనీలకు పలు మ్యూజిక్ వీడియోలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఇతను ఆశుతోష్‌ గోవారికర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఖేలే హమ్‌ జీ జాన్‌ సే’ లో అభిషేక్ బచ్చన్‌, దీపికా పదుకొణెతో కలిసి నటించాడు.

ఇక మందాన విషయానికొస్తే.. గత దశాబ్దకాలంగా భారత మహిళా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల దక్షిణాఫ్రికా మహిళలతో జరిగిన వన్డే సిరీస్ లో రెండు వరుస సెంచరీలు సాధించి ఔరా అనిపించింది. మహిళల ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన క్రీడాకారిణి(రూ. 3 కోట్ల 40 లక్షలి)గా నిలిచింది. తన సారథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ మహిళా టీమ్) జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ సాధించి పెట్టింది.