స్నేహ శబరిశ్ తిరిగి జీహెచ్ఎంసీకి బదిలీ

స్నేహ శబరిశ్ తిరిగి జీహెచ్ఎంసీకి బదిలీ

హైదరాబాద్, వెలుగు: శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ స్నేహ శబరీశ్ తిరిగి జీహెచ్ఎంసీకి బదిలీ అయ్యారు. శుక్రవారం ఆమెను కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్​గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా శనివారం ఆమెను తిరిగి జీహెచ్ఎంఐసీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి.

 ఆమెకు బదులుగా జీహెచ్ఎంసీకి బదిలీపై వచ్చిన వెంకటేశ్​దాత్రేను ఆసిఫాబాద్​కలెక్టర్​గా నియమించింది. స్నేహ శబరీశ్​జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ గా, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్​గా కొనసాగనున్నారు. గతంలో జోనల్ కమిషనర్ గా మమత ఉన్న సమయంలోనూ ఉత్తర్వులు ఇలాగే వచ్చాయని బల్దియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.