న్యూఢిల్లీ: సాఫ్ట్ డ్రింకులు వాడకం పెరిగింది. కాంతర్ ఎఫ్ఎంసీజీ ప్లస్ రిపోర్ట్ ప్రకారం, గత రెండేళ్లలో కుటుంబాలు తాగుతున్న సాఫ్ట్ డ్రింక్స్ 250 ఎంఎల్ పెరిగాయి. ప్రీమియం లాండ్రీ ప్రొడక్ట్గా పరిగణించే ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ ప్రస్తుతం ప్రతీ ఇంట్లో కనిపిస్తోంది. దీంతో పాటు ఎఫ్ఎంసీజీ కంపెనీలు అమ్ముతున్న వాషింగ్ లిక్విడ్స్ సేల్స్ 2023–24 లో లక్ష టన్నుల మార్క్ను దాటింది.
కాంతర్ రిపోర్ట్ ప్రకారం, కన్జూమర్లు ఏడాదిలో సగటున 156 సార్లు ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్లను కొనుగోలు చేస్తున్నారు. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ప్రతీ 56 గంటలకు షాపింగ్ చేస్తున్నారు. కానీ, కన్జూమర్లు కొంటున్న మొత్తం ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్ల విలువ 2023–24 లో తగ్గింది.