![డిప్రెషన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి సూసైడ్!](https://static.v6velugu.com/uploads/2025/02/software-employee-life-end-with-depression_9v6DU2TlmL.jpg)
పంజాగుట్ట, వెలుగు: ఒంటరిగా ఉంటున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి డిప్రెషన్లో ఉరేసుకొని చనిపోయాడు. హైదరాబాద్ మౌలాలికి చెందిన జి. శ్రీకాంత్(31) సాఫ్ట్వేర్ ఉద్యోగి. విశాఖకు చెందిన శ్రీలతతో అతనికి 2012లో పెండ్లి అయింది. వీరికి ఒక కూతురు ఉండగా, మనస్పర్థలు రావడంతో 2022లో భార్యతో విడిపోయాడు.
ఆ తర్వాత పంజాగుట్ట ఎల్లారెడ్డిగూడ సుభాష్నగర్ లోని విజయ్ కరణ్ అపార్ట్ మెంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఇటీవల ఉద్యోగం మానేసిన శ్రీకాంత్కు తన తల్లి దుర్గాంబ మంగళవారం ఫోన్ చేయగా, లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆమె బుధవారం శ్రీకాంత్గదికి వచ్చి చూడగా, ఇంట్లో ఉరేసుకొని చనిపోయి కనించాడు. పంజాగుట్ట పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. డిప్రెషన్కారణంగానే శ్రీకాంత్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.