ఈడబ్య్లూఎస్ ​సర్టిఫికెట్లతో మోసం

ఈడబ్య్లూఎస్ ​సర్టిఫికెట్లతో మోసం
  • టీచర్​ఉద్యోగం కోసం దొడ్డిదారి ప్రయత్నాలు
  • అధికారులకు ఫిర్యాదు​

మెదక్, వెలుగు: టీచర్​ ఉద్యోగం సంపాదించేందుకు కొందరు దొడ్డిదారిన ప్రయత్నాలు చేస్తున్నారు. అర్హత లేకున్నా తహసీల్దార్​ఆఫీస్ ల నుంచి ఈడబ్ల్యూఎస్​సర్టిఫికెట్లు సంపాదించి వాటి ఆధారంగా ఉద్యోగాలు పొందే ప్రయత్నం చేశారు. దీంతో అర్హత ఉన్న అభ్యర్థులుఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల వెలువడిన డీఎస్సీ ఫలితాల్లో1:3 కింద ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేషన్​వెరిఫికేషన్​కొనసాగుతోంది. మెదక్​జిల్లాలో ఈ డబ్ల్యూఎస్​ కింద 13 పోస్టులు ఉండగా 1:3 లెక్కన 39 మందిని పిలిచారు. 

ఈ మేరకు వారు సంబంధిత సర్టిఫికెట్లు సమర్పించారు. వారిలో హవేలీ ఘన్​పూర్​మండలానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల భార్యలైన ఇద్దరు మహిళా అభ్యర్థులు అర్హత లేకున్నా తహసీల్దార్ ఆఫీస్​ల నుంచి ఈ డబ్ల్యూఎస్​ సర్టిఫికెట్లు సంపాదించి వాటిని సమర్పించారు. 

ఈ విషయమై మెదక్​కు చెందిన నిఖిత, రేగోడ్​కు చెందిన నరేశ్​అడిషనల్​కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. వారిద్దరూ అర్హత లేకున్నా దొడ్డిదారిన ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉద్యోగాలు పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారని, వారి కారణంగా నిజమైన అర్హులు  ఉద్యోగాలు కోల్పోవలసి వస్తుందని తెలిపారు. అధికారులు స్పందించి న్యాయం చేయకుంటే తాము లీగల్​గా ప్రొసీడ్​అవుతామని పేర్కొన్నారు. ఈ విషయమై డీఈవో వివరణ కోరగా ఈడబ్ల్యూఎస్​సర్టిఫికెట్ల విషయంలో ఇద్దరు అభ్యర్థులపై ఫిర్యాదు అందగా వారిని రిజెక్ట్​ చేస్తున్నట్టు తెలిపారు.  ​