టాలీవుడ్ పెద్ద మనసు.. వరద బాధితుల సహాయార్థం సీఎం రేవంత్ను కలిసి చెక్కులు అందజేత

టాలీవుడ్ పెద్ద మనసు.. వరద బాధితుల సహాయార్థం సీఎం రేవంత్ను కలిసి చెక్కులు అందజేత

వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి సినీ నటుడు సాయిధరమ్ తేజ్ రూ.10 లక్షలు విరాళం అందజేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి సాయిధరమ్ తేజ్ చెక్ అందజేశారు. తెలుగు సినిమా హాస్య నటుడు ఆలీ కూడా తన భార్యతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి చెక్కును ఇచ్చారు. యువ నటుడు విశ్వక్ సేన్ కూడా సీఎంను కలిసి చెక్కును ఇచ్చారు. 

ఇటీవల తెలంగాణను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. తెలంగాణను.. మరీ ముఖ్యంగా ఖమ్మం జిల్లాను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. మున్నేరు పొంగి కన్నీరు మిగిల్చింది. వందల మంది వరదల వల్ల తీవ్రంగా నష్టపోయారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.

Also Read :- మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన

ఒక్క ఖమ్మం జిల్లాలోనే సుమారు 4 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగినట్టు అధికారులు అంచనా వేశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఖమ్మం జిల్లాలో జరిగిన నష్టం రూ.729.68 కోట్లు.  ఖమ్మం నగరంలో ఎవరిని కదిలించినా కన్నీళ్లు పెట్టుకుంటున్నరు. మున్నేరు, లకారం వాగులు ఉప్పొంగడంతో ఇండ్లన్నీ నీట మునిగాయి.  వందలాది కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలిపోయాయి. వరద ప్రవాహం తగ్గినప్పటికీ.. ఇండ్లల్లోని సామాన్లతో పాటు నిత్యావసరాలన్నీ పాడైపోయాయి. టీవీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లతో సహా ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ పనికిరాకుండా పోయాయి. గ్యాస్ సిలిండర్లు వరదలో కొట్టుకుపోయాయని బాధితులు కన్నీరు పెట్టుకున్నారు. 


 

వరద బాధితుల కష్టాలకు చలించిపోయిన కొందరు టాలీవుడ్ ప్రముఖులు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, చిరంజీవి, మహేశ్ బాబు.. ఇలా ఇండస్ట్రీలో ఒక స్థాయిలో కొనసాగుతున్న నటులతో పాటు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న నటులు కూడా వరద బాధితులకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ప్రకటించిన సాయానికి సంబంధించిన చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్కు చేరేలా ఒక్కొక్కరుగా సీఎంను కలిసి అందజేస్తున్నారు.