ఆన్​లైన్‌‌‌‌ గేమ్స్ వద్దన్నందుకు.. పేరెంట్స్ను చంపిన కొడుకు ఒడిశాలో ఘోరం

ఆన్​లైన్‌‌‌‌ గేమ్స్ వద్దన్నందుకు.. పేరెంట్స్ను చంపిన కొడుకు ఒడిశాలో ఘోరం

భువనేశ్వర్: ఆన్​లైన్ గేమ్స్ ఆడొద్దని చెప్పినందుకు ఓ యువకుడు తన తల్లిదండ్రులను కొట్టి చంపేశాడు. అడ్డుకున్న అక్క పైనా దాడి చేసి ఆమె ప్రాణాలు తీశా డు. ఒడిశాలోని జగత్​సింగ్ పూర్ జిల్లాలో మంగళవారం ఈ దారుణం జరిగింది. మొబైల్ ఫోన్​లో నిత్యం గేమ్స్​ ఆడుతున్న సూర్యకాంత్(21)​ను తల్లిందండ్రులు మందలించారు. 

ఏం జరిగిందో తెలియదుగానీ, మంగళవారం (మార్చి 4) సూర్యకాంత్ బండరాయితో తల్లి కనక్లత(62), తండ్రి ప్రశాంత్ సేథీ(65)ని కొట్టి చంపాడు. అడ్డుకోబోయిన అక్క రోసలిన్(25)పైనా రాయితో దాడి చేయగా, ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్​కు వెళ్లి డెడ్​బాడీలను పోస్ట్​మార్టానికి తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.