
న్యూఢిల్లీ: సోనమ్ కపూర్ బావ అనంత్ అహుజాకి సంబంధం ఉన్న ఓ ఎన్జీఓ యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యూఎస్ఏఐడీ) నుంచి రూ. 6.5 కోట్ల సాయం పొందింది. ఇండియాలోని వలస కూలీల ఒంటరితనాన్ని తగ్గించే ప్రాజెక్ట్ కోసం ఈ గ్రాంట్ అందుకుంది.
యూఎస్ఏఐడీ ఈ ఎన్జీఓకి 7,50,000 డాలర్ల గ్రాంట్ను ఇచ్చిందని రిపబ్లికన్ ప్రతినిధి నాన్సీ మేస్ యూఎస్ పార్లమెంట్లో పేర్కొన్నారు. యూఎస్ఏఐడీ ప్రపంచంలోని అందరి బాధలను తీర్చడంలో బిజీగా ఉందని, వీటి వలన అమెరికాకు ఎటువంటి లాభం లేదని కామెంట్ చేశారు.