New Toll Rules: ఏడాదికి టోల్ పాస్ రూ.3వేలే.. శాటిలైట్ ఆథారిత టోల్ అప్పటి నుంచే..

New Toll Rules: ఏడాదికి టోల్ పాస్ రూ.3వేలే.. శాటిలైట్ ఆథారిత టోల్ అప్పటి నుంచే..

New Toll Charges: దేశంలోని హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలపై సమస్యలను తగ్గించేందుకు కొత్త టోల్ పాలసీలో మార్పులను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో రుసుములను సగటున 50 శాతం వరకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. అలాగే రానున్న కాలంలో వార్షిక పాసులను రూ.3వేలకు అందించాలని ప్లాన్ చేస్తున్నారని వెల్లడైంది. ఇది అన్ని నేషనల్ హైవేలతో పాటు రాష్ట్రాల ఆధీనంలో ఉండే ఎక్స్‌ప్రెస్‌వేలపై కూడా చెల్లుబాటు అవుతాయని తెలుస్తోంది.

అలాగే రుసుమును ఫాస్టాగ్ ద్వారా చెల్లించటానికి వీలుంటుందని వెల్లడైంది. అలాగే కొత్త టోల్ పాలసీ కింద గేట్లు తెరచుకోవటానికి, క్లోజ్ అవ్వటానికి గడువు ఉండనుంది. కొత్త పాలసీలో టోల్ ప్లాజాల ఏర్పాట్లకు బదులుగా కిలోమీటరుకు ఫిక్స్‌డ్ ఛార్జీలను వసూలు చేస్తారు. సుమారుగా, ఒక కారు వంద కిలోమీటర్లకు రూ. 50 టోల్ ఫీజు చెల్లించాలి. ప్రస్తుతం నెలవారీ పాస్‌లు మాత్రమే జారీ చేస్తుండగా కొత్త పాలసీ కింద ఏడాది కాలానికి పాస్ లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

Also Read :- 2025లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు

కొత్త పాలసీ కింద కాంట్రాక్టర్లతో ఒప్పందాల కింద కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో వారికి కలిగే నష్టాలను భర్తీ చేసేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ అంగీకరించింది. ఇప్పటికే దీనిని మూడు చోట్ల ప్రయోగాత్మకంగా అమలు చేయటా సానుకూల ఫలితాలు వచ్చాయని వెల్లడైంది. అయితే కొత్త విధానం కింద బ్యాంకులకు మరిన్ని కొత్త పవర్స్ రానున్నాయి. అలాగే టోల్ చెల్లించకుండా వెళ్లే వాహనాలను నివారించటానికి భారీగా ఫైన్స్ కూడా తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. 

నితిన్ గడ్కరీ ఏమన్నారంటే..?
కొత్త వ్యవస్థ ప్రస్తుతం ఉపయోగిస్తున్న FASTag వ్యవస్థ కంటే మెరుగైన టోల్ కలెక్షన్ విధానాన్ని నిర్థారిస్తుందని కేంద్రం నమ్ముతోంది. రానున్న కాలంలో జీపీఎస్ ఆధారిత విధానాన్ని అమలు ద్వారా టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించటంతో పాటు ఆలస్యాలను నివారించాలని రవాణా సంస్థ నిర్ణయించింది. దీని ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతా నుంచి ప్రయాణించిన కిలోమీటర్లకు మాత్రమే టోల్ చెల్లించాల్సి ఉంటుంది. రానున్న 15 రోజుల్లో శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని అమలులోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.