వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు

వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు

సికింద్రాబాద్, వెలుగు: భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే వివిధ మార్గాల్లో 25 రైళ్ల సర్వీసులను రద్దు చేసింది. సోమవారం వరకు రద్దు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. విజయవాడ–తెనాలి, విజయవాడ–గుంటూరు, విజయవాడ–కాకినాడ పోర్ట్, రేపల్లి–-తెనాలి, గుడివాడ-–మచిలీపట్నం, భీమవరం–నిడదవోలు, నర్సాపూర్-–గుంటూరు, గుంటూరు-–రేపల్లె, మచిలీపట్నం-–విజయవాడ, ఒంగో లు–విజయవాడ మధ్య నడుస్తున్న రైళ్లను రద్దు చేసినట్టు వివరించారు.

 పలు ప్రధాన రైలు కేంద్రాల్లో హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లో హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు.