వికారాబాద్​ జిల్లాలో రైల్వే జీఎం పర్యటన

 వికారాబాద్​ జిల్లాలో రైల్వే జీఎం పర్యటన

వికారాబాద్​, వెలుగు:  వికారాబాద్​, తాండూర్​ రైల్వే స్టేషన్లను సౌత్​ సెంట్రల్​ రైల్వే జీఎం అనిల్​ కుమార్​ జైన్​ మంగళవారం సందర్శించారు.  అమృత్​ భారత్​ ద్వారా రైల్వే స్టేషన్లలో  ఆధునీకరణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఆర్​ఎం భర్తేశ్​​కుమార్​, సీనియర్​ డీఎస్​సీ  డెటాస్మిత్​ ఛటర్జీ, సీనియర్​ డీఎస్​టీఈ సుప్రియ, పీసీఓఎం  పద్మజ, వికారాబాద్ రైల్వే స్టేషన్​ మాస్టర్​ దేవేందర్​, ఆర్​పీఎఫ్​ సీఐ రాజేంద్రప్రసాద్​ తదితరులు పాల్గొన్నారు.  

ఆర్​యూబీ కోసం వినతి..

చేవెళ్ల నియోజకవర్గంలోని చిట్టిగడ్డ చించల్​పేట మధ్య , గొల్లగూడ వద్ద, ముబారక్​పూర్​ పర్వేద స్టేషన్ల మధ్య   ఆర్​యూబీ నిర్మించాలని ​ రైల్వే జీఎం అనిల్​ కుమార్​ జైన్​ కు ఎమ్మెల్యే కాలె యాదయ్య  వినతిపత్రం ఇచ్చారు.    చిట్టిగడ్డ రైల్వే స్టేషన్​లో అనిన ప్యాసింజర్​ రైళ్లు, ఫాస్ట్​ ప్యాసింజర్​ రైళ్లను ఆపాలని కోరారు. వికారాబాద్​ జిల్లా కేంద్రమైనందున వికారాబాద్​ రైల్వే స్టేషన్​లో రాజ్​కోట్​, కోణార్క్​ రైళ్లను ఆపాలని వికారాబాద్​ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కె.మాధవరెడ్డి రైల్వే జీఎం అనిల్​కుమార్​ జైన్​ను కోరారు.