బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు

బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు
  • భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ బి. రోహిత్​రాజు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్​ఆఫీసర్లను ఎస్పీ బి. రోహిత్​ రాజు ఆదేశించారు. హేమచంద్రాపురంలోని పోలీస్​ హెడ్​క్వార్టర్​లో మంగళవారం నిర్వహించిన క్రైం రివ్యూ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. దొంగ తనం కేసుల్లో చోరీ అయిన సొత్తును రికవరీ చేసి బాధితులకు న్యాయం చేసేలా కృషి చేయాలన్నారు.

 కొత్త కొత్త టెక్నాలజీతో సైబర్​ నేరగాళ్లు ప్రజల బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను మాయం చేస్తున్నారన్నారు. సైబర్​ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. నేరస్థులకు శిక్ష పడేలా చూడాలన్నారు. గంజాయి, మత్తు పదార్థాలు సప్లై చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పారు.

రౌడీషీటర్ల కదలికలపై గట్టి నిఘా పెట్టాలన్నారు. పోలీస్​ ఆఫీసర్లు కింది స్థాయి సిబ్బంది ఒత్తిడిని తగ్గించుకునేలా అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఈ ప్రోగ్రాంలో డీఎస్పీలు చంద్రభాను, రెహమాన్, సతీశ్​ కుమార్, రవీందర్​రెడ్డి, మల్లయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు. 

ఎస్సై స్వప్నను అభినందించిన ఎస్పీ..

రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్​లో ఫింగర్​ ప్రింట్స్​ విభాగంలో కాంస్య పతకం సాధించిన చంద్రుగొండ ఎస్సై స్వప్నను ఎస్పీ అభినందించారు. రాష్ట్ర స్థాయి పోలీస్​ డ్యూటీమీట్​లో బంగారు పతకం సాధించిన పోలీస్​ జాగిలం జూనోతో పాటు హ్యాండ్లర్​ హుస్సేన్​కు కూడా అభినందనలు తెలిపారు.