ఓపెన్ హౌస్ ప్రోగ్రాం ప్రారంభం

ఓపెన్ హౌస్ ప్రోగ్రాం ప్రారంభం

పాలమూరు, వెలుగు : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఎస్పీ ఆఫీసు పెరేడ్ గ్రౌండ్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఎస్పీ డి.జానకీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..  పోలీసు శాఖ నిర్వహణ, సిబ్బంది విధులు, పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. వారి సేవలను ప్రజలకు గుర్తు చేశారు.

ఇలాంటి ఓపెన్ హౌస్ కార్యక్రమాలు ప్రజలు, యువతలో దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకు పోలీసు శాఖపై అవగాహన పెంచేందుకు దోహదపడతాయని ఎస్పీ అన్నారు. ఈ ప్రోగ్రాంలో స్టూడెంట్స్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.