
ములుగు, వెలుగు : డ్రగ్స్రహిత ములుగు జిల్లా కోసం కలిసికట్టుగా కృషి చేద్దామని, అందుకు అవసరమైన శిక్షణ ద్వారా అవగాహన పెంచుకోవాలని ఎస్పీ డాక్టర్ పి.శబరీష్ పిలుపునిచ్చారు. గురువారం ములుగులోని జిల్లా పోలీసు కార్యాలయంలో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్(ఎన్డీపీఎస్) చట్టంపై పోలీసు అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
నార్కోటిక్ విభాగం డీఎస్పీ నరసింగరావు నార్కోటిక్ చట్టంపై అవగాహన కల్పించారు. యువత డ్రగ్స్ జోలికి పోవద్దని, జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, ములుగు డీఎస్పీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.