
- భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకుంటామని ఎస్పీ బి. రోహిత్ రాజు పోలీస్ సిబ్బందిని హెచ్చరించారు. హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్లో బుధవారం నిర్వహించిన క్రైం రివ్యూ మీటింగ్లో ఆయన మాట్లాడారు. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడే వారి పట్ల ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు.
విధుల్లో అంకిత భావంతో పనిచేసే వారిని ప్రోత్సాహిస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. డయల్ 100 ఫోన్ రాగానే సిబ్బంది స్పందించాలన్నారు. ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ కుమార్ సింగ్, డీస్పీలు చంద్రభాను, రెహమాన్, సతీశ్కుమార్, సీఐలు శ్రీనివాస్, నాగరాజు, జితేందర్ పాల్గొన్నారు.