
కామారెడ్డి టౌన్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాకు మూడు కంపెనీల కేంద్ర బలగాలు చేరుకున్నట్లు ఎస్పీ సింధూశర్మ పేర్కొన్నారు. బుధవారం జిల్లా పోలీస్ఆఫీస్లో స్థానిక ఆఫీసర్లు, కేంద్ర బలగాల అధికారులతో ఎస్పీ సమావేశమయ్యారు. జిల్లాపై అవగాహన వచ్చేలా కేంద్ర బలగాలకు పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. స్టేట్ బార్డర్, ఇతర చెక్పోస్టుల గురించి వివరించారు. కేంద్ర బలగాల ఇన్స్పెక్టర్రాజ్మోహన్సింగ్, మనోజ్కుమార్, కంజాన్జో, డీఎస్పీలు ప్రకాశ్, శ్రీనివాస్, జగన్నాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.