సంగారెడ్డి జిల్లాలో 30 పోలీసు యాక్ట్ అమలు 

సంగారెడ్డి జిల్లాలో 30 పోలీసు యాక్ట్  అమలు 

సంగారెడ్డి టౌన్, వెలుగు: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు30, 30(ఏ) పోలీసు యాక్ట్- అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ రూపేశ్, మెదక్ ఎస్పీ ఉదయ్​ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.  పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు.  

శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రజా ధనానికి నష్టం కల్గించే, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టవద్దన్నారు. పోలీసు వారికి సహకరించాలని సూచించారు. అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.